ప్రతి ఒక్కరు తమ వంతుగా మొక్కలు నాటాలి

866
  • మోర్తాడ్ లో పర్యటించిన డీ ఎల్ పీ వో శివకృష్ణ

బతుకమ్మ, మోర్తాడ్: ఆగస్టు09:  స్వచ్ఛధనం – పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు తమ వంతుగా పాల్కొని మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆర్మూర్ డివిజన్ డీ.ఎల్. పీ. వో శివ కృష్ణ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛధనం – పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. శుక్రవారం మోర్తాడ్ మండల కేంద్రంలో ని గ్రామపంచాయతీ స్థలంలో అధికారులతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మొక్కలు నాటడం వల్ల వర్షాలు సకాలంలో కురుస్తాయని పరిసరాలు పచ్చదనంతో కనిపిస్తాయని అన్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరు తమ వంతుగా మొక్కను నాటి వాటిని సంరక్షించేలా అందరికీ అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో మోర్తాడ్ ఎం.పీ.డీ.వో తిరుమల దేవి, ఎం.పీ.వో శ్రీధర్, ఏ.పీ.వో శకుంతల, పంచాయితీ కార్యదర్శి శ్రీనివాస్ అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.