. తెలంగాణ కో ఆపరేటీవ్ సొసైటీ చైర్మన్
బతుకమ్మ, నిజామాబాద్ సిటీ:
మహనీయుల త్యాగాలను మరువొద్దని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ర్ట కో ఆపరేటీవ్ సొసైటీ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. గాంధీ చౌక్ వద్ద నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేశ వేణు జెండాను ఎగురవేశారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు భక్తవత్సలం,జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి, బీసీ సెల్ మాజీ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మీసాల సుధాకర్ రావు, సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్,బొబ్బిలి రామకృష్ణ,కేశ మహేష్, ఈసా,జగడం సుమన్,మహిళా అధ్యక్షురాలు మటం రేవతి,పోల ఉష,చంద్రకళ,గాజుల సుజాత,శరత్ కుమార్,దత్తు, ప్రమోద్, గౌతం, కేశ రాజు తదితరులు పాల్గొన్నారు