- కిడ్నాప్, ఫోక్సో కేసులు నమోదు
బతుకమ్మ, నిజామాబాద్ రూరల్ : నిజామాబాద్ జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానంటూ మాయమాటలు చెప్పి శారీరకంగా వాడుకున్న వ్యక్తిని రిమాండ్ కు తరలించారు. అదే విధంగా అతనికి సహకరించిన మరో బాలుడిపైన సైతం కేసు నమోదు అయింది. పూర్తి వివరాలలోకి వెళ్తే రెంజల్ మండలానికి చెందిన ఓ మైనర్ బాలిక తన కుటుంబ సభ్యులతో బతుకు దెరువు నిమిత్తం నిజామాబాద్ కి వచ్చి ఉంటున్నారు..బాలిక ఒక షాప్ లో పని చేస్తూ కుటుంబానికి చేదోడు వదోడు గా ఉంటుంది. ఇలాంటి సమయంలో మిర్చి కాంపౌండ్ కి చెందిన వ్యక్తి రోజు ఆమె వెంటపడుతూ వేధిస్తూ ప్రేమిస్తున్న పెళ్ళిచేసుకుంట అంటూ మాయమాటలు చెప్పి కరీంనగర్ కి వల్ల అమ్మమ్మ ఇంటికి తీసుకుని వెళ్లి అక్కడ ఆమెను లోబర్చుకుని అత్యాచారం చేశాడు..తర్వాత తన కూతురు కనిపించట్లేదు అని పోలీస్ స్టేషన్ లో తల్లి ఫిర్యాదు చేయగా ఈ విషయంలో పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా నిందితుడు దొరికాడు..విచారణలో బాలిక మైనర్ కావడంతో ఆ విధంగా కేసు నమోదు చేసి ఆ వ్యక్తిని జైలుకు పంపించారు.ఈ విషయంలో ఈ విషయంలొ సహకరించిన మరో బాలుడి పై కూడా కేసు నమోదు అయింది…ఈ అగత్యానికి పాల్పడ్డ వ్యక్తి మరియు బాలుడు రోజు బైక్ పై జులాయి తిరుగుతూ అమ్మాయిల వెంట పడి వేధించే వారని పోలీస్ లు తెలిపారు….