కే జీ బీ వీ ఎస్ స్కూళ్లను తనీఖీ చేసిన డీ ఈ ఓ

1,269

బతుకమ్మ, బాల్కొండ : బాల్కొండ, ముప్కాల్ మెండోరా మండలాలకు చెందిన కేజీబీవీఎస్ స్కూళ్లను డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దుర్గాప్రసాద్ మంగళవారం ఆకస్మికంగా తనీఖీ చేశారు.ఇందులో భాగంగా ఆయా స్కూల్స్ లోని వంటశాలలను తనీఖీ చేశారు. విద్యార్థులకు పెడుతున్న వంటలను పరిశీలించారు. అనంతరం ఆయా స్కూల్ విద్యార్థులతో స్వయంగా కలిసి మాట్లాడారు. స్కూళ్ళల్లో విద్యా బోధనా, విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న భోజనం నాణ్యత, మెనూ లను గురించి అడిగి తెలుసుకొన్నారు.విద్యార్థులకు అందించే భోజనం విషయంలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూడాలని, తేడా వస్తే కఠిన చర్యలు తప్పవని డీ ఈ ఓ హెచ్చరించారు. ఆయా పాఠశాలల్లో ఉన్న మౌళిక సదుపాయాలను గురించి డీ ఈ ఓ విద్యార్థుల ద్వారా ఆరా తీశారు.

DEO inspected KGBVS schools

Leave A Reply

Your email address will not be published.