రూ.25 వేల విరాళం
బతుకమ్మ, బోధన్ : నవీపేట్ మండలంలోని నాళేశ్వర్ లో స్వయంభూ రాజరాజేశ్వర ఆలయ ప్రహరీ నిర్మాణానికి బినోల సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మాండ్లు రూ.25 వేల విరాళం అందజేశారు. గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు తనవంతుగా ఆర్థిక సహాయం అందిస్తున్న హన్మాండ్లుకు గ్రామాభివృద్ధి కమిటీ ధన్యవాదాలు తెలిపింది. కార్యక్రమంలో వీడీసీ సభ్యులు ఆర్మూర్ సురేశ్, బాద్గుణ స్వామి, పుప్పాల సుధాకర్, మోహన్, కిషన్, పోతన్న పాల్గొన్నారు.