బతుకమ్మ, బాన్సువాడ:
బ్రిటీష్ బానిస సంకెళ్ల నుంచి విముక్తి కలిగి 78 ఏళ్లయినా స్వాతంత్ర్య ఫలాలను ఇప్పటికీ కొందరు అనుభవించడం లేదనేందుకు బాన్సువాడలో చోటు చేసుకున్న ఘటన రుజువుచేస్తోంది. తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ఆర్డీఓ రమేశ్ రాథోడ్ బూట్లు వేసుకొని జెండా గద్దె వద్దకు వెళ్లాడు. ఆ తరువాత పొరపాటు తెలుసుకొని బూట్లు విడిచి అటెండర్ (సబార్డినేట్)తో పంపించారు. జెండా సాక్షిగా పై అధికారి బూట్లను అటెండర్ మోయడం చర్చనీయాంశమైంది.