. భయాందోళనలో వీఆర్ఏలు
బతుకమ్మ, బిచ్కుంద :
ఇసుక అక్రమరవాణాను అడ్డుకుంటే తమపై దాడులు చేస్తున్నారని వీ ఆర్ ఏలు భయాందోళనకు గురవుతున్నారు. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ తహసీల్దార్ తోపాటు పోలీసు సర్కిల్ ఇన్ స్పెక్టర్ కు గురువారం వినతిపత్రం అందజేశారు. బిచ్కుంద మండలంలోని మంజీరా పరివాహక గ్రామాలైన షెట్లుర్, ఖత్గవ్, హస్గుల్ గ్రామాల నుంచి ప్రతిరోజూ చీకటి పడిన నుంచి తెల్లవారుజాము వరకు వందలాది ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. పదుల సంఖ్యలో గుమిగూడుతున్న ఇసుక వ్యాపారులు వీ ఆర్ ఏలను భయాందోళనకు గురి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తమకు రక్షణ కల్పించకుంటే తాము విధులు నిర్వర్తించలేమని అధికారులకు మొరపెట్టుకున్నారు.