బతుకమ్మ, ఇందల్వాయి : ఇందల్వాయి గ్రామానికి చెందిన లబ్ధిదారులకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం కళ్యాణ లక్ష్మి,చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన ఉండి అన్ని విధాల ఆదుకుంటామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో మరిన్ని అభివృద్ధి పథకాలను ప్రజల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను అతి తొందర్లోనే పరిష్కారం చేసి ప్రజల మన్నలను పొందిన నాయకులుగా అభివర్ణించారు ఈ కార్యక్రమంలో ఇందల్వాయి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్, కిసాన్ కేక్ జిల్లా అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు నారాయణ,వసంతరావు, తదితరులు పాల్గొన్నారు.