ప్రతి గ్రామంలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించాలి

1,129

రుద్రూర్, (బతుకమ్మ) : రుద్రూర్ మండల కేంద్రంలో గురువారం బిజెపి కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రుద్రూర్ మండలం ఇంచార్జ్ మోహన్ రెడ్డి, బాన్సువాడ నియోజకవర్గం కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్ లు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. జాతీయ పార్టీ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 2 వ తేదిన రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి ఏముల గజేందర్, సాయినాథ్, పార్వతి మురళి, రాజారామ్, శానం బాలు, మండల నాయకులు, శక్తీ కేంద్రం ఇంచార్జ్ లు, బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.