- జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్
బతుకమ్మ నిజామాబాద్ సిటీ : విద్య బోధనతో విద్యార్థిని విద్యార్థులు తమ తలరాతను మార్చుకోవచ్చు అని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్ అన్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు విద్యార్థి భవిష్యత్తును తీర్చిదిద్దుతారని, ప్రతి విద్యార్థి ఉపాధ్యాయ, అధ్యాపకుని గౌరవించాలని అన్నారు. నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గురువారం నాడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ బుద్దిరాజ్ అధ్యక్షత వహించగా, జిల్లా ఇంటర్ విద్య అధికారి రవి కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
నిరుపేద విద్యార్థినీ, విద్యార్థులు అధ్యాపకుల బోధనను శ్రద్ధతో విని భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించారు. దేశంలోనే అత్యున్నత పదవిని అలంకరించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా ఉపాధ్యాయ వృత్తి ద్వారా రాష్ట్రపతి పదవికి పైకి ఎదిగారని అన్నారు. కావున ప్రస్తుత తరుణంలో అధ్యాపకులు భావిభారత పౌరులైన విద్యార్థులకు బంగారు భవిష్యత్తును చూపించాలని అధ్యాపకులను ఉద్దేశించి అన్నారు. విద్యార్థులు శ్రద్ధతో ప్రతిరోజు కళాశాలకు హాజరై తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించారు. విద్య నేర్చుకోవడానికి కులము, మతము, పేద, ఐశ్వర్యవంతులుగా ఉండవలసిన అవసరం లేదని ప్రతి విద్యార్థి శ్రద్ధతో ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని లక్ష్యసాధన దిశగా విద్యను అభ్యసించాలని అన్నారు. బాలికల కళాశాలలో ప్రతి అధ్యాపకుడు శక్తి వంచన లేకుండా తమ విధులు నిర్వర్తిస్తూ విద్యార్థుల ను తీర్చిదిద్దేందుకు చేస్తున్న కృషిని అభినందించారు.
కళాశాల ప్రిన్సిపల్ బుద్దిరాజ్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పై అధ్యాపకులు వ్యక్తిగత శ్రద్ధ వహించి పనిచేస్తూ భావిభారత పౌరులను తీర్చిదిద్దడానికి కృషి చేయాలని అన్నారు. అధ్యాపక వృత్తి మహోత్కృష్టమైనదని, రేపటి పౌరులైన విద్యార్థినులు ద్వారా దేశ భవిష్యత్ కు దోహదపడుతుందని అన్నారు. వైశ్యుడు, ఇంజనీర్, న్యాయవాది, ఇతర ఏ వృత్తి అయిన ఒక గురువు వద్దనే విద్యను అభ్యసించాల్సి ఉంటుందని అన్నారు. ఉపాధ్యాయ వృత్తి ని ప్రతి ఒక్కరు గౌరవిస్తారని అన్నారు. అధ్యాపకులు విద్యార్థులలో నిబిడీకృతమైన జ్ఞానాన్ని వెలికి తీసి వారి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుతారని అన్నారు. విద్యార్థులు ప్రతిరోజు తాము అభ్యసిస్తున్న విద్యను భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండేందుకు వినియోగించుకోవాలని అన్నారు .
స్వయం పాలన దినోత్సవం సందర్భంగా విద్యార్థినులు గురువారం నాడు అధ్యాపకులుగా అవతారమెత్తి విద్యను బోధించారు. ఒకరోజు అధ్యాపకులుగా పనిచేసిన విద్యార్థులకు ఈ సందర్భంగా జిల్లా ఇంటర్ విద్యా అధికారి శ
రవి కుమార్, ప్రిన్సిపాల్ బుద్దిరాజు, అధ్యాపకులు సర్టిఫికెట్లను అందజేశారు.
