- రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించిన కేర్ డిగ్రీ కళాశాల విద్యార్థి షేక్ బిలాల్
బతుకమ్మ నిజామాబాద్ : కేర్ డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి మంచిర్యాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలలో బంగారు పతకం సాధించినట్లు ఆ కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ తెలిపారు. బంగారు పతకం సాధించిన షేక్ బిలాలను శుక్రవారం సన్మానించి అభినందించారు. నిజామాబాద్ లో క్రీడలను ప్రోత్సహిస్తున్న కోచ్ ను ఈ సందర్భంగా అభినందించారు. జాతీయస్థాయిలో ఉషూ పోటీల్లో పాల్గొనడానికి ఈనెల 20న షేక్ బిలాల్ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి వెళ్తున్నట్లు తెలిపారు. తమ వంతుగా అన్ని సహాయ సహకారాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ నరేష్, కళాశాల ఇంచార్జ్ సందేశ్ పాల్గొన్నారు.