బతుకమ్మ, నిజామాబాద్ క్రైం
బిర్యానీ తినేందుకు రెస్టారెంట్ కు వచ్చిన కస్టమర్ కు షాక్ తగిలింది. బిర్యానీలో మాంసం ముక్కలతో పాటు కోడిఈకలు కూడా కనిపించడంతో ఖంగుతిన్నాడు కస్టమర్. వెంటనే నిజామాబాద్ బల్ధియా అధికారులకు ఫిర్యాదు చేశాడు. బల్ధియా అధికారులు తనిఖీలు చేసి వినాయక్ నగర్ లోని బిర్యానీ దర్బార్ ఫ్యామిలీ రెస్టారెంట్ కు రూ.5 వేల జరిమానా విధించారు. గతంలోనూ బిర్యానీ దర్భార్ ఫ్యామిలీ రెస్టారెంట్ కు ఆయిల్ వినియోగంలో తేడా ఉండడంతో బల్ధియా అధికారులు జరిమానా విధించారు.
