పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి

1,370
  • ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ డిమాండ్

బతుకమ్మ, నిజామాబాద్ :  నిజామాబాద్ జిల్లాలో సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాక్లూర్ మండలం. మాణిక్ బండర్ చెక్క దగ్గర శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని రుణమాఫీ కానీ రైతులకు వెంటనే కాలయాపన చేయకుండా రుణమాఫీ చేయాలని ఆయన అన్నారు. సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో ఫారెస్ట్ అధికారులు గిరిజనులపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే పోడు భూములకు పట్టాభిస్తానని ఒకపక్క చెప్పుకుంటూ అమాయకమైన గిరిజనులపై దాడులు చేయడం సరికాదని ఆయన అన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని అట్లాగే రైతులకు రైతు భరోసా ఇవ్వాలని అన్ని పంటలకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాగు చేసుకుంటున్న పోడు భూములపై ఫారెస్ట్ అధికారులు దాడులు ఆపాలని సాగు చేసుకుంటున్నా పోడు భూములు అన్నిటికీ పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అబ్బయ్య, ప్రశాంత్, లక్ష్మణ్, రామకృష్ణ, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.