బతుకమ్మ, నిజామాబాద్ : నగరంలోని న్యాల్ కల్ రోడ్డులో న్న లండన్ కిడ్స్ పాఠశాలలో గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి కింది తరగతుల వారికి పాఠాలు బోధించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు అన్నపూర్ణ, రమ్య తదితరులు పాల్గొన్నారు.