వై ఎస్ సేవలు మరువలేనివి

491

బతుకమ్మ, నిజామాబాద్: దివంగ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలు మరువలేనివని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని కాంగ్రెస్ భవన్ లో వై  ఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని నిర్వహించారు. వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముప్ప గంగారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా వైఎస్ తన హయాంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వడంతోపాటు రుణమాఫీ చేశారని, విద్యార్థులకు ఫీజు రియింబర్స్ మెంట్ ఇచ్చిన ఘనత వైఎస్ కే దక్కిందన్నారు. కార్యక్రమంలో ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, ఎన్ ఎస్ యూ  ఐ జిల్లా అధ్యక్షుడు వేణురాజ్, రాష్ర్ట ఉపాధ్యక్షుడు విపుల్ గౌడ్, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు సంతోష్, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నగర అధ్యక్షుడు ప్రీతం, సుభాష్ జాదవ్, సాయిలు,లవంగ ప్రమోద్, స్వామి గౌడ్, సాయి కుమార్, కేశ రాజు, సృజన్ తదితరులు, పీ ఆర్ వో ఎస్.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.