మిషన్ భగీరథ నీరు వచ్చేదెప్పుడో..?

1,038
  • పూర్తి అయిన సర్వే..

బతుకమ్మ, మోర్తాడ్:  తలా పాపునకు నీరుండి తడియారని గొంతు అన్నట్టుగా కనిపిస్తుంది మిషన్ భగీరథ పథకం. ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేసి నిత్య నీరు సరఫరా చేయాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం ఫలాలు ప్రజలకు సక్రమంగా అందడం లేదు. గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది నిర్వహిస్తున్న సర్వేలో ఈ విషయాలు తేటతెల్లమవుతున్నాయి.
ప్రతి ఇంటికి మిషన్ భగీరథ కుళాయి ఉందా..? నీరు వస్తుందా..? తదితర వివరాలతో చేపట్టిన సర్వే జిల్లాలో పూర్తయింది. మొత్తం 2,59,580 గృహాల్లో సర్వే పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకోగా అంతకుమించి 2,74,784 ఇండ్లలో నిర్వహించి 105. 86 శాతం పూర్తయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. పంచాయతీ కార్యదర్శులు అంగన్వాడీ టీచర్లు తదితరులు దాదాపు అన్ని ఇండ్లలో సర్వే చేపట్టారు.
9000 కుళాయిలు అవసరం..
ప్రస్తుత సర్వే వివరాల ఆధారంగా జిల్లాలో 9 వేయిల కుళాయి సౌకర్యం లేని ఇండ్లను గుర్తించారు. మొత్తంగా జిల్లాలో 9 వేయిలా ఇండ్లకు కొత్తగా కుళాయిలు అవసరమని తెలుసుకున్నారు. కేంద్ర జల శక్తి పథకం ద్వారా నిధులు సమీకరించి ఆయా ఇళ్లకు సౌకర్యం కల్పించేందుకు సన్నహాలు చేస్తున్నారు. దీని ఆధారంగా ఎన్ని ఇండ్లకు అదనంగా నీరు సరఫరా చేయాలి. కొత్తగా ఎన్నింటికి కనెక్షన్లు అవసరం సరఫరా అవుతున్న కుళాయిలు ఎన్ని స్థానిక వనరుల ద్వారా ఎన్ని నడుస్తున్నాయి తదితర వివరాలు ప్రభుత్వానికి చేరాయి. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించనుంది.
ఉన్నతాధికారుల దృష్టికి
రాకేష్ ఈ ఈ (మిషన్ భగీరథ) నిజామాబాద్.
నిజామాబాద్ జిల్లాలో 9,000 ఇండ్లకు కులాయి సౌకర్యం లేదని గుర్తించడం జరిగింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి కుళాయి సౌకర్యం లేని ఇళ్లకు కుళాయిలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాము.

Leave A Reply

Your email address will not be published.