. . . శ్రీరాం సాగర్ కు పోటేత్తిన వరద
. . . రెండు లక్షల క్యూసెక్కుల ఇన్ ప్లో
. . . 40 గేట్లు ఎత్తిన ఎస్సారెస్పీ ఎత్తి లక్షా 50 వేల క్యూసెక్కులు గోదావరిలోకి
బతుకమ్మ, నిజామాబాద్
ఉత్తర తెలంగాణ వరప్రధాయని శ్రీ రాం సాగర్ ప్రాజెక్టుకు వరధ పోటేత్తింది. ఉదయం 1,62,182 క్యూసెక్కుల వరద రాగా ఉదయం 8 గేట్లను ఎత్తి 34,853 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. 11 గంటల ప్రాంతంలో 26 గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కులను గోదావరిలోకి వదిలారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో లక్షా 95 వేల 767 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రావడంతో లక్ష క్యూసెక్కులను దిగువకు వదిలారు. మధ్యాహ్నం 12: 30 ప్రాంతంలో వాటిని మరింత పెంచి 40 గేట్లను ఎత్తి దిగువకు లక్షా 50 వేల క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు దిగువకు వదిలారు. వర్షాకాలంలో తొలిసారి ప్రాజెక్టు గేట్లను సోమవారం ఎత్తారు. సందర్శకులతో ప్రాజెక్టు సందడిగా మారింది.
