బతుకమ్మ, నిజామాబాాద్ : నగర శివారులోని మాధవ నగర్ రైల్వే గేట్ వధ్ధ రాకపోకలు నిలిచిపోయాయి. సాంకేతిక లోపం కారణంగా రైల్వే గేటు తెచ్చుకోవడం లేదు. దీంతో రెండు గంటల నుంచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటువైపుగా వెళ్లే వాహనదారులు ముందుకు వెళ్లలేక వెనక్కు తిరిగి రాలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం అక్కడ మరమ్మతు పనులు సాగుతున్నాయి.
