బతుకమ్మ, ఏర్గట్ల : బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరా , మోర్తాడ్, ముప్కాల్, ఏర్గట్ల ప్రాంతాల్లో గొలుసు దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు భీంగల్ సిఐ నవీన్ తెలిపారు. శుక్రవారం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. శుక్రవారం ఏర్గట్ల ఎస్సై డి.రాము తన సిబ్బందితో ఏర్గట్ల మండల కేంద్రంలోని అయ్యప్ప గుడి వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహించామన్నారు. అక్కడ వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా మెండోరా మండలం దూదిగాం గ్రామానికి చెందిన చవాన్ కిరణ్ సింగ్ అనే యువకుడు అనుమానాస్పదంగా కనిపించడంతో అతన్ని పట్టుకుని విచారించడంతో నాలుగు చైన్ స్నాచింగ్ కేసులు కొలిక్కి వచ్చాయమన్నారు. నాలుగు చైన్ స్నాచింగ్ కేసులలో మూడు బంగారు చైన్ లతో పాటు పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు. చైన్ స్నాచర్ ను పట్టుకోవడంలో ఏర్గట్ల ఎస్సై రాము , సిబ్బంది పనితీరును సిఐ అభినందించారు.