భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఎల్ఐసి వెన్నుముక

10
  • మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్

బతుకమ్మ, ఆర్మూర్ : భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఎల్ఐసి వెన్నుముకలాంటిదని ఆర్మూర్ మున్సిపల్ ఛైర్పర్సన్ వన్నెల్ దేవి లావణ్య శ్రీనివాస్ అన్నారు.శుక్రవారం బ్రాంచ్ మేనేజర్ ఎల్.సక్రు అధ్యక్షతన జరిగిన ఎల్ఐసి 68 వారోత్సవాల ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.అన్ని వర్గాల ప్రజలకు ఎల్ఐసి పాలసీలు ఉన్నాయనీ.ప్రతి ఒక్కరికీ జీవిత బీమా అందించడమే లక్ష్యంమని అన్నారు.అలాగే క్లెయిమ్ ల చెల్లింపు 98.4 శాతం చెల్లించామని అన్నారు. ఎల్‌ఐసి దేశంలోనే గొప్ప ఆర్థిక సంస్థగా ఎదిగిందన్నారు. ఎల్ఐసి అంటే పాలసీదారులకు నమ్మకం అని ఎన్నో కుటుంబాలకు ఆర్థికంగా సాయపడుతుందన్నారు.పాలసీదారుల సేవలో ఎల్‌ఐసి ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితులలో ఎల్‌ఐసి అనేది ప్రతి ఒక్కరికీ అవసరమని తెలియజేశారు.దేశ ఆర్థిక వ్యవస్థ కు 43 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను అందించిందని అన్నారు.దేశ వ్యాప్తంగా 15 లక్షల మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తుందని,ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్ గా నిలిచిందని అన్నారు.కేరళ తుఫాను లో మరణించిన 36 మంది బాధిత కుటుంబాలకు ఎలాంటి కాగితాలు లేకుండానే బీమా సొమ్ము అందజేసినట్లు పేర్కొన్నారు.గడిచిన ఆర్థిక సంవ్సరంలో 6.104 కోట్ల డివిడెండ్ ను కేంద్ర ప్రభుత్వానికి అందించినట్లు పేర్కొన్నారు.పాలసీదారులకు మరింత సేవలు అందించడమే సంస్థ లక్ష్యమని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ మేనేజర్‌ ఆనంద్, ఎఒ. శ్రీనివాస్ డెవలప్ మెంట్ ఆఫీసర్లు, ఆఫీసు సిబ్బంది, ఏజెంట్‌ మిత్రులు, పాలసీదారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.