పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి

577

. ఐదుగురి అరెస్ట్, రూ.44వేల స్వాధీనం

 బతుకమ్మ, వేల్పూర్:  మండల కేంద్రంలో పేకాటస్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు సీపీ కల్మేశ్వర్ దేశాలతో ఆదివారం రాత్రి పేకాటస్థావరంపై టాస్క్ ఫోర్స్ ఏసీపీ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేసి ఐదుగురిని అరెస్ట్ చేశారు. రూ.44,980 నగదు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వేల్పూర్ పోలీస్ స్టేషన్ లో ఐదుగురిపై కేసు నమోదు చేశారు.

Leave A Reply

Your email address will not be published.