బతుకమ్మ, నిజామాబాద్ క్రైం: నగరంలోని లలితానగర్ కు చెందిన కొత్వాల్ రామ్ గోపాల్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటంబ సమస్యల కారణంగా మానసిక ఒత్తిడికి గురైన రామ్ గోపాల్ ఈ నెల 21న పురుగల మందు తాగి ఇంటికి వచ్చాడు. తాను పురుగుల మందుతాగానని కొడుకుకు తెలుపగా అతడు వెంటనే జనరల్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున కన్నుమూశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఐదో టౌన్ ఎస్సై వెంకట్రావు తెలిపారు.