బాధిత మహిళకు ఎన్ఎస్ యుఐ ఆర్థిక సహాయం

1,273

బతుకమ్మ, భీంగల్ : భీమ్‌గల్ పట్టణానికి చెందిన జుబేదా(60)అనే మహిళా గత రెండు సంవత్సరాలుగా చెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతుండగా ఆమె వైద్యం కోసం స్థానిక ఎన్ ఎస్ యు ఐ నాయకులు ఆదివారం ఆర్ధిక సహాయాన్ని అందించారు. ఆమె పరిస్థిని తెలుసుకున్న ఈ యువకులు నిరుపేద, భాదిత మహిళ జుబేదా కు చికిత్స నిమిత్తం ఎన్ ఎస్ యు ఐ జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ రెహమాన్, నాయకులు భోజ రాజు, పుప్పాల విశాల్, సుంకరి సురేష్ లు కలిసి సహాయంగా రూ.5500 ఆర్థిక సహాయాన్ని అందించారు.ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ రెహమాన్ మాట్లాడుతూ క్యాన్సర్ తో బాధపడుతున్న జుబేదా దీనస్థితిని అర్థం చేసుకొని దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సాయం ఇవ్వాలని ఆయన కోరారు.జుబేదా విషయాన్ని కాంగ్రెస్ జిల్లా నాయకులకు తెలియజేసి ప్రభుత్వం ద్వారా ఉచిత వైద్యం అందేలా ప్రయత్నం చేస్తానని సయ్యద్ రహిమాన్ వారి కుటుంబానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో అరవింద్, రహీల్,అభినవ్, రుమాన్ ఎన్ఎస్ యుఐ యువకులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.