బతుకమ్మ,మోర్తాడ్: శ్రీ కృష్ణాష్టమి పండుగను పురస్కరించుకొని మోర్తాడ్ మండలంలోని శెట్ పల్లీ గ్రామంలో నూతనంగా 31 ఫీట్ల ఉట్టి కొట్టే స్తంభాన్ని ఏర్పాటు చేశారు. స్తంభం కొత్తది కావడంతో ప్రత్యేకంగా అలంకరించారు. గ్రామంలో కృష్ణాష్టమి పండుగను ఘనంగా నిర్వహించడానికి సోమవారం ఉదయ కాలం నుంచి పనులు చేపట్టారు. కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ బబ్బురి నడిపి లింబన్న, బక్కూరి లింగం, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.