దర్జాగా రాతం చెరువు కబ్జా

3,593
  • 15 యేండ్లుగా 30 శాతం శిఖం స్వాహా
  • చెరువులోనే వెంచర్లు . .  భవంతుల నిర్మాణాలుDarjaga Ratham pond is occupied

బతుకమ్మ,నిజామాబాద్ ప్రతినిధి – రాష్ట్రంలో హైడ్రా పేరిట ప్రభుత్వం చెరువులు,కాలువలు,శిఖం భూములు,ప్రభుత్వ భూములను చెర బట్టిన వాటికి విముక్తి కల్పిస్తున్న విషయం తెల్సిందే. రాష్ట్రంలో హైడ్రా పేరు చెబితే అందరికీ ముఖ్యంగా కబ్జాదారులకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. ఎందుకంటే కబ్జాదారులు ఎవరైనా,ఎంతటి వారైనా ఉపేక్షించకుండా కూల్చివేతలను చేపట్టిన కబ్జాల నుంచి విముక్తి చేసిన విషయం తెల్సిందే. హైదరాబాద్ ను వీడి హైడ్రా జిల్లాలకు వస్తుందన్న చర్చ మొదలయింది. బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్ లోని రాతం చెరువు కబ్జా వ్యవహరం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దాదాపు 30 శాతం శిఖం కబ్జాలోకి వెళ్లిన ఎవరు పట్టించుకోలేదు. ఒకప్పుడు మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న భీంగల్ ఇప్పుడు బల్ధియాగా అప్ గ్రేడ్ అయినప్పటికీ రాతం చెరువు కబ్జాలు మాత్రం ఆగడం లేదు. ఏకంగా చెరువు శిఖం భూమిలోనే వెంచర్లు వేసి ప్లాట్ల దందా జరుగుతున్న దాని ఇంటి నంబర్లతో రిజిస్ట్రేషన్లు జరుగుతున్న వార్డు బ్లాక్ రిజిస్ట్రేషన్లను పట్టించుకునే వారు లేరు. కొందరు వ్యవసాయం చేస్తుండగా కొందరు ఇళ్ళను నిర్మించుకుని దర్జాగా కబ్జా చేశారు.

భీంగల్ పట్టణం లోని అటు భీంగల్ టూ బడా భీంగల్,ఇటు భీంగల్ టూ మోర్తాడ్,వేల్పూర్ కు వెళ్లే ప్రధాన రహదారిని అనుకోని ఉన్న రాతం చెరువును భూబకాసురులు ధర్జాగా కబ్జా చేస్తున్నారు. గత ప్రభుత్వం ఈ రాతం చెరువును ఎంపిక చేసుకొని భీంగల్ ట్యాంక్ బాండ్ గా తీర్చి దిద్దుతుంటే,ఈ భూబకాసరులు ప్రజాప్రతినిధులు,అధికారుల అండతో అమాంతం 30 శాతం భూమిని భూస్వాహా చేసేసారు. ఈ చెరువు శిఖం సర్వే నంబర్ 27 లో మొత్తం 72 ఎకరాల భూమి ఉండగా ఈ భూసురులు సూమారు 22 ఎకరాలు కబ్జా చేశారంటే అతిశయోక్తి కాదు.ఒకప్పుడు 200పై చిలుకు ఎకరాలకు సాగునీరందించిన ఈ గొలుసు కట్టు చెరువు కబ్జాదారుల కారణంగా కుచించుకపోయింది. ఈ చెరువు లో ఈ ఘనులు ఏకంగా మాముళ్లు ఇచ్చి నాన్ లేవుట్ వెంచర్లు వేసి అమాయకులకు పక్క సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్ చేసి అమ్ముతున్నారు. కొందరెమో ఈ చెరువులో పెట్టిన వెంచర్లలో ప్లాటు అమ్మక పోతే వాటిలో అధికారులను,ప్రజా ప్రతినిధులకు మాముళ్లు ఇచ్చి మచ్చిక చేసుకొని ఇల్లీగల్ గా ఇండ్ల నిర్మాణం చేపడుతున్నారు. ఈ ఇండ్ల నిర్మాణం పూర్తయ్యాక గతంలో గ్రామ పంచాయతీ లో ప్రస్తుతం మున్సిపల్ లో ఆ ఇంటికి నంబర్ ఇప్పించుకొని ధర్జాగా అమ్మేస్తున్నారు.ఇదిలా ఉండంగా మరొక పక్క సుమారు 6 ఎకరాల వరకు పక్క పట్టా సాగుదారులు శిఖం కబ్జా చేసి సాగు చేస్తున్నారు. ఇట్లా కబ్జా తంతు గత 15 యేండ్లుగా నిర్వీరామంగా జరుగుతున్న అధికారులు నిమ్మకునీరెత్తనట్లు వ్యవహారిస్తున్నారు. ఇంకా ఈ కబ్జాలు ఇలాగే కొనసాగితే రాతం చెరువు మొత్తం కబ్జా అవ్వడం ఖాయమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఇటు స్థానిక రెవిన్యూ,ఆర్ఎస్డబ్ల్యూ,మున్సిపల్ ఇతర సంబంధిత అధికారులు పట్టించుకోకపోగా,డివిజన్,జిల్లా స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదని పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకరాతం చెరువే కాకుండా భీంగల్ మండలంలో ధర్మారాయుడు కుంట, 426 సర్వే నంబర్ లో ఉండగా దానికి 5.38 ఎకరాల విస్తీర్ణంగా రికార్డులో ఉంది. దాదాపు 70 శాతం కబ్జాకోరల్లో చిక్కుకుంది. అదే విధంగా మొగలి చెరువు 544 సర్వేనంబర్ లో 41 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు 70 శాతం అక్రమార్కుల చేతిలో చిక్కుకపోయింది. ఇప్పటికైనా ఈ కబ్జాలపై జిల్లా కలెక్టర్ దృష్టి కేంద్రికరించి, విచారణ జరిపి భాద్యులను శిక్షించాలని,భూబకాసురుల కోరల నుండి ఈ రాతం చెరువు శిఖంను కాపాడాలని కోరుతున్నారు.

Darjaga Ratham pond is occupied
ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు
భీంగల్ తహసీల్దార్ షబ్బీర్
ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తే ఎంతటి వారికైనా కఠిన చర్యలు తప్పవని భీంగల్ తహసీల్ధార్ షబ్బీర్ అన్నారు. గ్రామంలో రాతం చెరువు సర్వే నిర్వహించి కబ్జాను గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. కబ్జాదారుల వివరాలు, కబ్జా స్థలాల వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.