శ్రీనగర్ వద్ధ ఘోర రోడ్డు ప్రమాదం

1,637

. . .లారి ని డి కోట్టిన  కారు

 . . .ఇద్ధరు యువకుల దుర్మరణం

 . . .మరోకరికి తీవ్రగాయాలు

 బతుకమ్మ, నిజామాబాద్ క్రైం

నిజామయబాద్ రూరల్ మండలం శ్రీనగర్ వద్ధ బుదవారం తెల్లావారు జామున ఘోర రోడ్డు ప్రమాధం జరిగింది.  ఈ ప్రమాధంలో ఇద్ధరు యువకులు దుర్మరణం చెందగా ఓక్కరికి గాయాలు అయ్యాయి. ఈ సంఘటనకు సంబందించిన వివరాలు స్థానికులు,  పోలిస్ లు కధనం ప్రకారం ఇలా ఉన్నాయి. నిజామాబాద్ రూరల్ మండలం శ్రీనగర్ గజానంద్ రైస్ మిల్ల వద్ధ రెండు రోజులుగా రహదారిపై రోడ్డులో దిగబడిన లారీ  ఎపి 39  య 9099 ని నిజామాబాద్ దుబ్బ నుంచి మాక్లూర్ చిక్లీ వెలుతున్న టిఎస్ 16 హెచ్ఎప్ 4275 కారు డికోట్టింది. బుదవారం తెల్లవారు జామున కారు 90 కిలో మీటర్ల స్పీడ్ లో డికోట్టింది.

Srinagar road accident

ఈ ప్రమాదంలో కారు టాప్ మొత్తం తుక్కు తుక్కుగా ఎగిరిపోయింది. ఈ ప్రమాదంలో మాక్లూర్ మండలం చిక్లి గ్రామానీకి చెందిన దండ్ల వంశీ (17 ) అక్కడి కక్కడే చనిపోయాడు. మరో యువకుడు అతని స్నేహితుడు కుడా (18 ) అక్కడే చనిపోయాడు.  కారు నడుపుతున్న నిజామాబాద్ దుబ్బకు చెందిన ఆకాశ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన ఆకాశ్ ను జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. వంశీ హోటల్ లో పని చేసేవాడని ఇటివల జ్వరంతో భాదపడుతు ఇంటి వద్ధ ఉండగా స్నేహితులు బయటకు వెలుదామని వేళ్లి తీరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాధం బారిన పడ్డారు. చని పోయిన మరో యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది. నిజామాబాద్ రూరల్ పోలిస్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డుపైన 24 గంటలుగా లారీ అగిన తోలగించకపోపవడం, మితి మీరిన కారు వేగం ప్రమాధానికి కారణం అని తెలిసింది. స్థానిక రైస్ మిల్ వద్ధ వాహనాలు రోడ్డు ప్రమాదానికి కారణం అవుతున్నాయని, మరణించిన యువకుల కుటుంబాలకు నష్ట పరిహరం ఇవ్వాలని స్థానికులు అందోళన నిర్వహించారు.  అంతే గాకుండా అక్కడి నుంచి డెడ్ బాడిలు తీయనీయమని పోలిస్ లతో వాగ్వివాదానికి దిగారు.

Srinagar road accident

Leave A Reply

Your email address will not be published.