- కామారెడ్డి ఎంఎల్ఏ వెంకట రమణా రెడ్డి
బతుకమ్మ, కామారెడ్డి : వరద ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి ఎంఎల్ఏ వెంకట రమణా రెడ్డి సూచించారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సోమవారం ముంపు ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లా యంత్రాంగం ప్రజలకు అందుబాటు లో ఉండాలన్నారు. విద్యుత్ సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అవసరం ఉంటేనే బయటికి రావాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అధికారులకు సహకరించాలని కోరారు.
