ఫేక్ కరెన్సీ కలకలం

1,265

. స్టార్ హోటల్ లో వ్యభిచారం చేస్తూ పట్టుబడిన వారి వద్ద నకిలీ నోట్ల కట్టలు
. పూర్తి వివరాలు వెల్లడించని పోలీసుశాఖ
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: వ్యభిచారం కొనసాగుతోందనే పక్కా సమాచారం మేరకు నిజామాబాద్ నగర శివారులోని ఓ హోటల్ పై దాడి చేసిన పోలీసులకు నకిలీ కరెన్సీ పట్టుబడడం కలకం రేపింది. పక్కా సమాచారం మేరకు బుదవారం రాత్రి హోటల్ పై దాడి చేసిన సీసీఎస్ పోలీసులు విటులతోపాటు నిర్వాహకులను, ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరి వద్ద నకిలీ కరెన్సీ పట్టుబడడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరి వద్ద ఫేక్ కరెన్సీ ఎందుకు ఉంది? నకిలీ నోట్ల చలామణిలో ఎవరి పాత్ర ఉందనేది ఇప్పుడు చర్చకు దారితీసింది.. ఐతే హైటెక్ వ్యభిచారంలో పోలీసులకు పట్టుబడిన విటులంతా జిల్లాలోని ఆర్మూర్ లోని వినాయక్ నగర్ కు చెందిన ఖాందేష్ అశోక్, నిజామాబాద్ నగరంలోని ద్వారక నగర్ కు చెందిన నల్ల శ్రీనివాస్, మెండోరాకు చెందిన సామా గంగాధర్ అలియాస్ గంగారెడ్డి, ముస్కు రాజా, కమ్మర్ పల్లి మండలం చౌట్ పల్లికి చెందిన కుంట లింగన్న, కమ్మర్ పల్లి మండల కేంద్రానికి చెందిన అలాల లింగారెడ్డి, సింగిరెడ్డి భరత్ లు ఉన్నారు. హైద్రాబాద్ ఫిలిం నగర్ కు చెందిన డ్రైవర్ ఉంతురు మధు సుధన్ లు ఉన్నారు. హైద్రాబాద్ లోని ఫిలీం నగర్ కు చెందిన వ్యక్తి పోలిస్ ల దాడిలో పట్టుబడటంతో యువతులను రప్పించడంలో అతని పాత్రపై పోలిస్ లు ఆరా తీస్తున్నారు. హై టెక్ పద్ధతిలో వాట్సప్ గ్రూప్ లలో యువతుల పోటోలను పంపి విటులను రప్పిస్తున్నట్లు తెలిసింది. హైటెక్ వ్యభిచారం కేంద్రం పైదాడి చేసి వారి వద్ధ నుంచి 13 మోబైల్స్ తో పాటు రూ.38,760 నగధు స్వాధినం చేసుకున్నారు. ఐతే పట్టుబడిన నకిలి నోట్ల వివరాలను పోలిస్ అధికారులు వెల్లడించలేదు. ఫేక్ కరేన్సి గుట్టును విప్పే పనిలో పడింది పోలిస్ శాఖ.

 

Leave A Reply

Your email address will not be published.