రుణమాఫీ కానీ రైతుల నుంచి దరఖాస్తు స్వీకరణ

1,444

బతుకమ్మ,మోర్తాడ్:  రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ కానీ రైతుల నుంచి మోర్తాడ్ నోడల్ అధికారి ఏ ఈ ఓ మహేష్ దరఖాస్తు స్వీకరించారు. మోర్తాడ్ మండలంలోని శేట్ పల్లీ గ్రామంలో గురువారం గ్రామపంచాయితీలో రుణమాఫీ కానీ రైతులతో సమావేశం ఏర్పటు చేసి రైతులకు అవగాహన కల్పించారు. రూ. రెండు లక్షల పైన ఉన్న రైతులు కూడా రావడంతో వారికి కూడా త్వరలోనే రుణమాఫీ వచ్చేలా చేయాలని అధికారికి విన్నవించారు. ఏఈఓ స్పందించి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కార్యక్రమంలో రైతులు అశోక్, నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.