బతుకమ్మ, జుక్కల్: మాజీ శాసన సభాపతి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నిజాం సాగర్ ప్రాజెక్టును పరీశిలించారు. గురువారం బాన్సువాడ నుండి హైదరాబాద్ వెళ్ళుతూ మార్గమధ్యంలో నిజాంసాగర్ ప్రాజెక్టును పోచారం పరిశీలించారు. ప్రాజెక్టులో ప్రస్తుతం నిల్వ ఉన్న నీరు, ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో వంటి వివరాలను సాగునీటి శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సాల్మన్ ను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 3.9 టియంసీ ల నీరు నిల్వ ఉన్నదని, ఇన్ ఫ్లో 400 క్యూసెక్కులు వస్తున్నదని సాగునీటి శాఖ అధికారులు పోచారం కు వివరించారు.
