బతుకమ్మ: బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో ని అన్ని వినాయక మండపాల వద్ద డీజే లు నిర్వహించకూడదని బిచ్కుంద సర్కిల్ ఇన్స్పెక్టర్ జగడం నరేష్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బిచ్కుందలో ఉన్న డీజే ఓనర్స్, ఆపరేటర్స్ అందరూ కూడా వినాయక చవితి పండగ సందర్భంలో పోలీస్ శాఖ వారికి తప్పకుండా సహకరించాలని వారందరికీ తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ప్రజల శాంతికి ,శాంతి భద్రతలకు చట్టానికి వ్యతిరేకంగా నడుచుకోవద్దని వారికి తగిన సలహాలు ఇవ్వడం జరిగింది. వినాయక చవితికి అందరూ కూడా పోలీస్ శాఖ అనుమతి తప్పకుండా తీసుకోగలరని వారికి తగిన సూచనలు చేయడం జరిగింది. వారందరిని సత్ప్రవర్తనతో ఉండాలని ఎమ్మార్వో వద్ద బైండోవర్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డి, బిచ్కుంద పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.