అప్పులకు మించి రుణ మాఫీ

3,512
  • సహకార బ్యాంకు అధికారుల లీలలు
  • ఇరవై రోజులుగా తొక్కి పెట్టిన వైనం
  •  రుణ మాఫీ జరుగకపోవడంతో నిలదీ సిన పాల్ధా రైతులు
  • పాల్ధా సొసైటి వద్ధ విచారణ జరిపిన అధికారులు
  •  వివాదాల పాల్ధా సొసైటిలో రుణమాఫీలో మరోకోణం

బతుకమ్మ, నిజామాబాద్: అప్పుడప్పుడు బ్యాంకుల అధికారుల లీలలు ఎవ్వరికి ఓ పట్టున అర్ధం కావు. ఖాతా దారుడికి సంబంధం లేకుండా వారి ఖాతాలలో డబ్బులు జమ చేయడం, తరువాత దానిని ఫ్రీజ్ చేసిన సంఘటనలు కోకోల్లలు. మరి కొంత మంది అధికారులు ఖాతాదారులకు సంబంధం లేకుండా వారి ఖాతాలలో డబ్బులు మళ్లించడం, వారి పేర్ల మీదా రుణాలు తీసున్న ఘటనలు జైలు పాలైన సంఘటనలు సర్వసాధరణం. కాని ఇటివల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రుణమాఫీ లో బ్యాంకు అధికారుల తీరుతో రుణమాఫీ జరుగక రైతులు అందోళన చెందుతున్నారు. ఈతతంగం ఇప్పుడు రాష్ర్టంలో రాజకీయంగా కోత్త అలజడికి కారణమైంది. కాని నిజామాబాద్ జిల్లాలో ఓక సహకార బ్యాంకు శాఖాధికారులు రైతులపై అపరిమితమైన ప్రేమను కనబరిచారు. రైతులు తీసుకున్న రుణాలకు సంబంధం లేకుండా వారు తీసుకున్న రుణాలకు ఓక్కటికి మూడింతలు మొదలుకోని పదింతలు వారి ఖాతాలో మాఫీ అయినట్టు నమోదు చేశారు. అయితే రైతులు సోసైటిలో, బ్యాంకులలో తీసుకున్న రుణాల లెక్కలు పరిమితి దాటడంతో వారు రుణమాఫీకి అర్హులు కాకుండా పోయారు. దానితో వారు జిల్లా అధికార యంత్రాంగంకు పిర్యాదు చేయడంతో నిజామాబాద్ రూరల్ మండలం పాల్ధా సోసైటిలో రైతులు రుణాలు తీసుకోగా వాటి మాఫీపై సహకార బ్యాంకు శాఖ అధికారులు జరిపిన బాగోతం బట్టబయలైంది.
రాష్ర్టంలో రైతులు రుణామాఫీ జరుగలేదని గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం మూడు విడతలలో ప్రకటించిన స్లాబ్ లలో తమ పేర్లు జాబితాలో లేవని కర్షకులు గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే. రైతుల ఆందోళనలతో దిగివచ్చిన ప్రభుత్వం ప్రతి మండలంలో వ్యవసాయ శాఖ తరుపున నోడల్ ఆఫిసర్ ను నియమించి కరేక్షన్ చెపట్టింది. రైతులు తాము తీసుకున్న రుణాలకు సంబంధించిన వడ్డితో కలిపిన ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ లేకపోవడంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులు తమకు న్యాయం జరుగుతుందని ఆశతో ఉన్నారు. కాని నిజామాబాద్ రూరల్ మండలం పాల్ధా సోసైటి రైతులు తాము తీసుకున్న రుణాలకు ప్రభుత్వం ప్రకటించి మాపీకి ఎమాత్రం పోంతన లేకపోవడం తమ ఆప్పులు మాఫీ కాపోవడంతో గగ్గోలు పెడుతున్నారు. పాల్ధా సోసైటి పరిధిలో పాల్ధా, తిర్మన్ పల్లి, సిహెచ్ కోండురు గ్రామాలు ఉన్నాయి. అ సోసైటి పరిధిలో 1200 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. 2019 నుంచి సోసైటిలో 113 మంది రైతులకు రుణమాఫికి పంపిని లెక్కలలో నిజామాబాద్ నగరంలో సుభాష్ నగర్ లోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు శాఖలో అధికారులు ప్రభుత్వానికి ఓక్క నివేదిక పంపించారు. అ నివేధికలో రైతులు తీసుకున్న రుణాలకు సంబంధం లేకుండా ఓక్కోక్కరకి 30 శాతం నుంచి 100 శాతం అధనంగా రైతులు రుణామాఫీ చేసినట్లు నివేధికలు పంపారు. ఇప్పుడు వాటి అధారంగా రుణమాఫీ జరుగకపోవడంతో గత నెల నుంచి రుణమాఫీ ప్రకటన తరువాత తమ రుణాలు మాఫీ కాకపోవడంతో సంబంధిత రైతులు వ్యవసాయ, సహకార, బ్యాంకు అధికారులకు పిర్యాదు చేశారు. అందులో దాదాపు రూ.55 నుంచి 60 లక్షల వరకు రైతులకు రుణమాఫీ ఖాతాలకు మళ్లించేందుకు ప్రయత్నం జరిగిందని గుర్తించారు. మంగళవారం పాల్ధా సోసైటి వద్ధకు వచ్చిన డిసిఓ,డిఎఓ, బ్యాంకు అధికారులను గ్రామస్థులు నిలదిశారు.
నిజామాబాద్ రూరల్ మండలం పాల్ధా సోసైటి వివాధాలకు పుట్ట అని చెప్పాలి. గత పాలక మండలి హయంలో రూ.1.10 కోట్ల నిధులు దారి మళ్లాయి అనే ఆరోపణలు ఉన్నాయి. ఎరువుల విక్రయాలతో పాటు రైతులు తీసుకున్న రుణాల తాలుకు డబ్బులు బ్యాంకు కు చెల్లించలేదని ఆరోపణలు ఉన్నాయి. సంబంధిత సోసైటి కార్యధర్శి సునిల్ రెడ్డి అత్మహత్యతో కధ అడ్డం తిరిగింది. సోసైటి కోత్త పాలకవర్గం రూ.80 లక్షల వరకు రికవరి చేసింది. కాని ఇప్పటికి సోసైటి కి మార్క్ ఫేడ్ నుంచి ఎరువులు ఇవ్వకుండా బ్లాక్ లీస్ట్ లో పెట్టారు. ఇప్పుడు రైతులు తీసుకున్న రుణాల తాలుక అప్పులను మాఫీ చేయకుండా వారిపేరుమీద జరిగిన అధనపు మాఫీ వేనుక ఎం జరిగిందనే వాదనలు ప్రారంభమయ్యాయి. సోసైటి బాధ్యులు, బ్యాంకు అధికారులు రైతుల రుణా మాఫీ ద్వార అధనపు డబ్బులు నోక్కేయాలని చూశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంపై టెస్కాబ్ అధికారులు స్పంధిస్తే గాని జిల్లా బ్యాంకు అధికారులు, సహకార, వ్యవసాయ శాఖాధికారులు గుర్తించకపోవడం దారుణం. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యమా లేక రైతుల ఖాతాలోకి డబ్బులు మళ్లించి నోక్కేయాలనుకున్నారే అనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా అధికార యంత్రాంగం విచారణ జరిపితే గాని ఈ విషయం కొ లిక్కి వచ్చేల లేదు.

Leave A Reply

Your email address will not be published.