మొగిలి చెరువు కింది మాటు కాల్వను నిర్మించాలి

1,470
  • జాయింట్ సర్వే నిర్వహించండి
  • మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి

బతుకమ్మ, భీంగల్ : భీంగల్ మండల కేంద్రంలోని మొగిలి చెరువు కింద ఉన్న పురాతన మాటు కాల్వ కబ్జాకు గురి అయిన కారణంగా తిరిగి ఆ చెరువు కింద మాటు కాల్వను నిర్మించాలని సంబంధిత అధికారులను మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.గత నాలుగు రోజులుగా భారీగా కురుస్తున్న కారణంగా జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం భీంగల్ మండల కేంద్రంలో జలమయమైన అయ్యప్ప నగర్ కాలనీని ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా స్థానిక కాలనీవాసులను కలిసిన మాట్లాడిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడారు. సత్వరమే ఇరిగేషన్ , రెవిన్యూ, మున్సిపల్ అధికారులు కలిసి మొగిలి చెరువు కింద జాయింట్ సర్వే నిర్వహించి, సాధ్యా, అసాద్యలను పరిశీలించి వర్షపు నేరుగా వెళ్లిపోయేటట్లు మాటు కాల్వను నిర్మించాలని ఆదేశించారు.ఇలాంటి సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆయన సూచించారు.ఈ కార్యక్రమం లో బాల్కొండ కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ బొదిరే స్వామి, స్టేట్ కార్పొరేషన్ ఛైర్మెన్లు మానాల మోహన్ రెడ్డి, సుంకేట అన్వేష్ రెడ్డి,తాహెర్ బిన్ హంధాన్ లు, మండల పార్టీ నాయకులుజే. జే నర్సయ్య,బాధవత్ గోపాల్ నాయక్, పర్స అనంత్ రావు, కొరడి రాజు, మల్లెల లక్ష్మణ్,మండల మహిళా విభాగం అధ్యక్షురాలు కల్పన, గంగామణి, ఎంకమ్మ, యువజన కాంగ్రెస్ నాయకులు వాక మహేష్, సురేష్, లింబాద్రి, శ్రీను, రాజేశ్, ఖలీం, మీరజ్, రత్నం, జుబేర్, నవీద్, జిషన్, రాజేశ్వర్, గంగాధర్, సేవాలాల్, విక్రమ్, రంజిత్, శాదుల్ల తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.