వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోవ్యాధులపై అవగాహన

1,267

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పట్టణ ఆరోగ్య కేంద్రం అర్సపల్లి పరిధిలోని కేర్ డిగ్రీ కళాశాల నందు సీజనల్ వ్యాధులపై ఆరోగ్య అవగాహన సదస్సును నిర్వహించడం జరిగినట్లు జిల్లా ఆరోగ్య విద్యా బోధకులు శ్రీ ఘనపూర్ వెంకటేశ్వర్లు తెలియజేశారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం, చికిత్స కన్నా నివారణ మిన్న, దోమల నియంత్రణ ద్వారా దోమలు పుట్టకుండా దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటూ దోమల ద్వారా వ్యాపించే మలేరియా, ఫైలేరియా ,డెంగ్యూ, చికున్ గున్యా, మెదడువాపు ,మొదలగు వ్యాధుల నియంత్రణతో పాటు ప్రజలందరూ దోమల ద్వారా వ్యాపించే ప్రాణాంతక వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. అదేవిధంగాప్రజారోగ్యంలో భాగంగా వ్యక్తిగత ఆరోగ్యo, కుటుంబ ఆరోగ్యo, సామాజిక ఆరోగ్యo, ఆధ్యాత్మిక ఆరోగ్యం ప్రధానమైనవని , అదేవిధంగా సీజనల్ వ్యాధుల్లో ప్రధానంగా వర్షాకాలంలో వ్యాపించే వ్యాధులు పై దృష్టి సారించాలని, కీటక జనిత వ్యాధులను నియంత్రణలో మలేరియా ,డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడువాపు, ఫైలేరియా ముఖ్యమైనవని, దోమల నియంత్రణకు ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలను తొలగించాలని, డ్రైనేజీల్లో పేరుకుపోయిన మురుగు, ప్లాస్టిక్, చెత్తాచెదారాన్ని తొలగించాలని, ఇంటి పరిసరాల్లో వాడి పారేసిన గ్లాసులు, కప్పులు, సీసాలు, బకెట్లు ,పగిలిన కుండలు, పాత టైర్లు, మొదలగు వాటిలో నీరు నిల్వకుండా వాటిని తొలగించాలన్నారు. అదేవిధంగా ఇళ్లలో వాడేటువంటి కూలర్లు నీటి తొట్టిలు ,సంపులు, ప్రతి శుక్రవారం (ఫ్రైడే డ్రైడే ,)శుభ్రంగా కడిగి ఎండపెట్టి మరుసటి రోజు నీటిని పట్టుకోవాలని లేనిచో దోమలు, డెంగీ దోమలు అందులో పెరిగి ఇ ళ్లలో నివసించే వారికి కుట్టడంతో డెంగ్యూ వ్యాధి ప్రబలునని చెప్పారు. అదేవిధంగా మలేరియా ,చికున్ గున్యా, మెదడువాపు, బోదకాలు వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడాలన్నారు. డొమెస్టిక్, పెరి డొమెస్టిక్ నీటి నిల్వలను తొలగిస్తూ యాంటీ లార్వల్ స్ప్రే చేయాలని, దోమతెరలను వాడుతూ మెశ్ను కిటికీలకు అమర్చుకోవాలన్నారు.దోమలు పుట్టకుండా దోమలు కుట్టకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. అదేవిధంగా ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు పది నిమిషాలు ప్రతి ఇంటి వద్ద నీటి నిల్వలను తొలగిస్తూ పరిసరాల పరిశుభ్రత పాటించినప్పుడు దోమల నియంత్రణ జరుగుతుందని జిల్లా వ్యాప్తంగా జిల్లా ప్రజలందరూ వైద్య సిబ్బందికి, ఆశాలు, ఏఎన్ఎం లకు సహకరిస్తూ సీజన్లో దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు నియంత్రించాలని, అదేవిధంగా నీటి కాలుష్యం జరగకుండా ప్రతి రోజు క్లోరినేషన్ చేసిన నీటిని వాడాలని, ఐ ఎస్ ఐ మార్క్ కలిగిన వాటర్ ప్లాంట్ల నీటినే వాడి, డయేరియా, కలరా,అతి సారా, టైఫాయిడ్, ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అప్పుడే జిల్లాలో సీజనల్ వ్యాధులను అరికట్టిన వారం అవుతామని తెలియజేశారు. అదేవిధంగా సీజనల్ వ్యాధులు ముఖ్యంగా కలిసితమైన ఆహారం, కలుషితమైన నీరు, ఈగలు ,దోమల ద్వారా, కలిసితమైన చేతి వేళ్ల ద్వారా, వ్యాపిస్తాయన్నారు. ముఖ్యంగా డయేరియా అతీసారా ,టైఫాయిడ్, నీళ్ల విరోచనాలు, ఇలాంటి వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. అదేవిధంగా అంటు వ్యాధులు, జీవనశైలి వ్యాధులు, పోషకాహారము, రక్తహీనత, వ్యక్తిగత పరిశుభ్రత, చేతుల శుభ్రత,స్వచ్ఛమైన తాగునీరు, పరిసరాల పరిశుభ్రత, పై అవగాహన కల్పించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ బాలకృష్ణ, తో పాటు ఆర్సపల్లి పట్టణ ఆరోగ్యకేంద్రo నుండి, సునీత ఆశా కార్యకర్త, పాల్గొన్నారు.

Awareness of diseases under the auspices of the Medical and Health Department

Leave A Reply

Your email address will not be published.