- 10 వడివిజన్ కార్పోరేటర్ భర్త నరేష్ తో పాటు ఐదుగురు పాత్రదారులు
- పోలీసుల అదుపులో నకిలీ పట్టాల సూత్రధారి
బతుకమ్మ, నిజామాబాద్ –నిజామాబాద్ నగరంలోని నాగారం 10వ డివిజన్ లోని బొందం చెరువు శిఖం భూమి లో అక్రమంగా వెంచర్ ఏర్పాటు చేసి పేద ప్రజలకు విక్రయించిన ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ రెవిన్యూ రికార్డుల ప్రకారం 2099 సర్వే నంబర్ లోని బొందచెరువు విస్తీర్ణం 23 ఎకరాల మూడు గుంటలు. 2016 వరకు అక్కడ చెరువు శిఖం భూమి గానీ నమోదయి ఉంది. ఇటీవల కాలంలో అక్కడ కొందరు వ్యక్తులు చెరువు శిఖం భూమిని ఆక్రమించి వెంచర్ ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వంగతంలో దొడ్డి కొమురయ్య కాలనీ, భారతి రాణి నగర్ కాలనీలో పేదలకు ఇచ్చిన పట్టాలను చెరువు శిఖం భూమిలోని ఉన్నాయని నమ్మించి మోసాలకు తెర లేపారు. సంబంధిత భూమిలో ప్రభుత్వం ఇచ్చిన పట్టాలని ప్లాట్లుగా చేసి విక్రయాలకు తెర లేపారు. దాదాపు 65 మందికి ప్లాట్లను విక్రయించారు. అందులో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్థానికంగా మట్టి రోడ్లను ఏర్పాటు చేయగావిద్యుత్ శాఖ ఆధ్వర్యంలో కరెంటు స్తంభాలను ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీలోని సెల్ఫ్ అసెస్మెంట్ యాక్ట్ కింద ఆస్తి పన్నులు చెల్లించిన వారికి ఇంటి నంబర్లు కేటాయించగా దానికింద టాక్స్ లు చెల్లించి భూములు ఇంటి నెంబర్లు ఆధారంగా ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి రిజిస్ట్రేషన్లు చేశారు. ఒక్కొక్కరి వద్ద లక్ష నుంచి రెండున్నర లక్షల రూపాయలు వసూలు చేసి చెరువు శిఖం భూమిని అంటగట్టారు. ఈనెల 17న రెవెన్యూ శాఖ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య చెరువు శిఖం భూమిలోని ఆక్రమణలు తొలగించారు. దానితో బాధితులు సంబంధిత పట్టాలను స్థానిక కార్పొరేటర్ కోమల్ భర్త నరేష్ తో పాటు హైమద్జావిద్ అహ్మద్గోపాల్, కమల లు విక్రయించారని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదివారం పోలీస్ స్టేషన్ నందు ధర్నా నిర్వహించి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ప్రాథమికంగా ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు మరి కొంతమంది ప్రమేయం ఉండవచ్చని తెలిపారు. అందులో ప్రధానంగా అందులో పెక్ పట్టాలను తయారు చేసిన మోటా జావిద్ అను డాక్యుమెంట్ రైటర్ ను మంగళవారం పోలిస్ లు అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో డాక్యుమెంట్ రైటర్ గా పని చేస్తున్న జావిద్ గత ప్రభుత్వం హయంలో పట్టాలను తయారు చేసి పెదలకు విక్రయించడంలో కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. అతనిపై పోర్జరీ, ప్రాడ్ కేసులను నమోదు చేసి విచారిస్తున్నట్టు తెలిసింది.ఈ కేసులో మిగితా ఐదుగురు పరారీలో ఉన్నట్లు సమాచారం.
Prev Post
Next Post