బతుకమ్మ, నిజామాబాద్ క్రైం
నిజామాబాద్ నగరంలోని స్టేషన్ రోడ్డులోని డ్రైనేజీలో అప్పుడే పుట్టిన పసికందు మృతదేహం లభించింది. ఈ సంఘటన అదివారం మద్యహ్నం వెలుగు చూసింది. నిజామాబాద్ రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం పక్కన ఉన్న డ్రైనేజీలో నవ జాత శిశువు ను పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. నవ జాత శిశువు పుట్టిన తరువాత డ్రైనేజీ పాలు చేయడం తో తల్లిధండ్రుల కర్కశత్వం పలువురు పలు విధాలుగా అంటున్నారు. స్థానిక పోలిస్ లకు సమాచారం అందించడంతో పసికందు మృతదేహం ను ఆసుపత్రికి పోస్టు మార్టం కోసం తరలించారు.