పేదలకు పట్టాల విక్రేత మేయర్ భర్త శేఖరే

1,219

. . . 10 వ డివిజన్ కార్పోరేటర్ భర్త నరేష్ కు సంబంధం

. . . ధండు చంద్రశేఖర్ అనుచరులే ప్లాట్లు విక్రయించారు

. . . పోలిస్ స్టేషన్ ఎదుట బోందం చేరువు శిఖం ప్లాట్ల బాధితుల అందోళన

. . . పోలిస్ స్టేషన్ లో పిర్యాదు

బతుకమ్మ, నిజామాబాద్:

నిజామాబాద్ నగరంలోని 10,11,12,13 డివిజన్ లలో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన పట్టాలను మార్పిడి, నకిలి పట్టాలు తయారు చేసి రియల్ దందాలో పేదలకు విక్రయాలు చేసేది అక్కడ స్థానిక కార్పోరేటర్ల ప్రమేయం బహిర్గతం అయింది. బిఆర్ఎస్, కాంగ్రెస్,  మజ్లీస్ పార్టీలను తెడాలేకుండా పేదలకు ఓకప్పుడు ప్రభుత్వాలు ఇచ్చిన భూములతో పాటు ఖాళీ జాగాలు ఉంటే కబ్జా చేసి దందా నడుపుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ర్టం ఎర్పడిన తరువాత నాగారం, దోడ్డి కోమురయ్య కాలని, 50, 80 ,300 క్వార్టర్స్ తో, పేయింటర్ కాలనీ, డ్రైవర్స్ కాలనీ, అసద్ బాబా నగర్ లతో పాటు జర్నలిస్టులకు ఇచ్చిన ప్లాట్లను సైతం చెర బట్టి ప్లాట్లను ,చేసి విక్రయించే దందా జోరుగా సాగుతుంది. శనివారం జిల్లా అధికార యంత్రాంగం బోందం చేరువు శిఖం భూమిలో ఆక్రమంగా చెపట్టిన నిర్మాణాలను పోలిస్ బందోబస్తు మద్య కుల్చివేసిన విషయం తెలిసిందే. అక్కడ ప్లాట్లు కోనుగోలు చేసి ఇండ్లను నిర్మించుకున్న బాధితుల అధారంగా  10 వ డివిజన్ లోని  బొందం చెరువు శిఖం భూమి కబ్జా వెనుక కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పలువురు స్థానిక నేతలు నకిలీ పట్టాలు సృష్టించి పేదలకు వాటిని విక్రయించినట్లు తెలిసింది. వంద గజాల ప్లాటుకు రూ.2 లక్షల వరకు సదరు వ్యక్తులకు ముట్టజెప్పినట్లు బాధితులు  అరోపించారు. శనివారం ఉదయం బొందం గడ్డ చెరువు శిఖం భూమిలో నిర్మించిన అక్రమ కట్టడాలను రెవెన్యూ అధికారులు కూల్చివేయగా బాధితులు తమ కుటుంబాలతో కలిసి ఆదివారం నగరంలోని ఐదో టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. అనంతరం ఎంఐఎం కార్పొరేటర్లు, నాయకులతో కలిసి తమకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. 9, 10, 11 డివిజన్లకు చెందిన ప్రస్తుత మేయర్ దండు నీతు కిరణ్ భర్త దండు శేఖర్‌, 11 వ డివిజన్ కార్పోరేటర్ కోమలి భర్త నరేశ్‌ తో పాటు అక్కడ వారి అనుచరులు మహమ్మద్‌,హైమద్‌లతో పాటు పలువురు స్థానికంగా ఖాళీగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి వాటికి పట్టాలు సృష్టించి పేదలకు ఒక్కోక్క ప్లాటును రూ. లక్షన్నర నుంచి రూ.2 లక్షల చొప్పున విక్రయించారు. పట్టాల ద్వారా నగరపాలక సంస్థ నుంచి ఇంటినంబర్లు పొందారు. దానికి ఇటివల ఎసిబి కి చిక్కిన మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటేండేంట్ దాసరి నరేంధర్ సహయం చేసినట్లు తెలిసింది. వారి ద్వార సెల్ప్ అసెస్మంట్ తో ఇంటి నంబర్ లను బల్ధియా నుంచి పోందిన వారు పలువురు ఇళ్ల నిర్మాణాలు కూడా చేపట్టారు. అనంతరం విద్యుత్‌ శాఖ నుంచి మీటర్‌ పర్మిషన్లు కూడా తీసుకున్నారు. రాష్ర్ట వ్యాప్తంగా చెరువులు, ప్రభుత్వ భూములను కాపాడాలని స్పేషల్ డ్రైవ్ చెపట్టిన విషయం తెలిసిందే. అందులొ భాగంగానే బొందం చెరువు శిఖం భూమి సైతం ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం రెవెన్యూ అధికారులు ఇటీవల గుర్తించారు. సర్వే నిర్వహించి పెద్దమొత్తంలో ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైనట్లు తేల్చారు. ఈ క్రమంలోనే శనివారం సంబంధిత అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. కాగా బాధితులు పోలిస్ స్టేషన్ లొ పట్టాలు విక్రయించిన అసలు విషయాలు బయటకు వెల్లడించడం నగరంలో చర్చకు దారితీసింది. పలువురు స్థానిక ప్రజాప్రతినిధుల భర్తలు ప్రభుత్వ స్థలాలపై కన్నేసి వాటిని అడ్డదారిలో విక్రయించగా వీరిలో ఇద్దరు బీఆర్‌ఎస్‌ నేతలు, మరో ఇద్దరు కాంగ్రెస్‌కు చెందిన నేతలున్నారు. ఈ నేపథ్యంలో బాధితులు పోలిస్ స్టేషన్ లో లిఖిత పూర్వకంగా పిర్యాదు చేయడం తోపోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Mayor's husband Shekhar sold the rails to the poor

Leave A Reply

Your email address will not be published.