బతుకమ్మ, నిజామాబాద్ : ఆల్ ఇండియా నెంబర్ వన్ డీలర్ వరుణ్ మోటార్స్ నెక్స నిజామాబాద్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించినట్లు వరుణ్ మోటార్స్ నిజాంబాద్ జిఎం రమణ గుప్త తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గ ప్రసాద్ హాజరయ్యారని పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని నెక్సా షో రూమ్ లో గత ఐదు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం జిల్లా నలుమూలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను సన్మానిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం కూడా సుమారు వంద మంది ఉపాధ్యాయులను సన్మానించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేక్సా ఏజీఎం మధు, టి పి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు వి.సురేష్, పీ ఆర్ టీయు బోధన్ డివిజన్ అధ్యక్షులు శంకర్, టీ ఆర్ టీ ఎఫ్ అధ్యక్షులు క్రిష్ణ రెడ్డి, స్థానిక నాయకులు రవీంద్ర నాథ్ ఠాగూర్, సదానంద, రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.
