కరెంట్ కోతలపై మేగ్యనాయక్ తండా వాసుల ఆగ్రహం
–మీ సమస్యను పరిష్క పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ
–సీఐ హామీతో ఆందోళన విరమింపజేసిన ఆందోళన కారులు
బతుకమ్మ, ఇందల్వాయి
ఇందల్వాయి మండల కేంద్రంలోని గన్నారం సబ్ స్టేషన్ వద్ద శనివారం ఉదయం మేఘ్యనాయక్ తండ గ్రామస్తులు సబ్ స్టేషన్ సబ్ స్టేషన్ ను ముట్టడించారు. తమ గ్రామంలో నిత్యం కరెంటు కోత విధించడం వల్ల తమకు ఇబ్బందులు ఆగ్రహం వ్యక్తం చేశారు.అనంతరం సబ్ స్టేషన్ ముందు బైటాయించి ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న స్థానిక డిచ్ పల్లి సీఐ మల్లేష్, ఇందల్వాయి ఎస్ఐ మనోజ్ కుమార్ లు సంఘటన స్థలానికి స్థలానికి చేరుకొని ఆందోళన చేస్తున్న మెగ్యనాయక్ తండా గ్రామస్తులను ఆందోళన విరమించాలని కోరారు. తమ సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యను పరిష్కరించే విధంగా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమింపజేశారు. తన సమస్య పరిష్కారం కానట్లయితే ఆందోళనను మరింత ఉదృతం చేసి హైవే రోడ్ పై బైటాయించి నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసనలో మాజీ ఎంపిటిసి లాకావత్ లలిత గణేష్,, వీడీసీ చైర్మన్ మనిషి రామ్, గ్రామస్తులు నర్సింగ్ , దర్శింగ్,దేవేందర్ ,ఈరమన్ గ్రామస్తులు పాల్గొన్నరు.