బతుకమ్మ, మోర్తాడ్
శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు మోర్తాడ్ మండలంలో వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిన్నాయి. మోర్తాడ్ మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన 75 మి.మీ వర్షపాతంగా నమోదైనట్లు ఏ ఎస్ వో నరేష్ తెలిపారు రాత్రి నుంచి అదివారం ఉదయం వరకు ఏకధాటిగా వర్షం పడింది.పెద్ద వాగుపై నిర్మించిన చెక్ డ్యాంలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాల్లోని చెరువులు నిండుకుండలా జలకల సంతరించుకొని అలుగులు పారుతున్నాయి. మోర్తాడ్ మండలంలోని ధర్మోరా, గాండ్లపేట, సుంకేట్ గ్రామాల్లో పెద్ద వాగు పై నిర్మించిన చెక్ డ్యాంలు నిండిపోయి పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలువురు పర్యాటకులు ఈ జల దృశ్యాలను ఆస్వాదించడానికి వస్తున్నారు. కురుస్తున్న వర్షాలకు గ్రామాల్లోని చెరువులు, చెక్ డ్యాంలు నిండి పోవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ధర్మోరా- పాలేం రోడ్డు మూసివేత…
మోర్తాడ్ మండలలోని పాలెం ధర్మోరా గ్రామాల మధ్య పెద్దవాగుపై నిర్మించిన చెక్ డ్యాం ఎక్కువ ప్రవాహముతో పొంగిపొర్లుతున్నందున వాహనదారులు ఎవరు కుడా ధర్మోరా- పాలేం రోడ్డు ద్వార వెళ్లకూడదని మోర్తాడ్ ఎస్సై విక్రమ్ తెలిపారు. ఆదివారం ఉదయం ఆయన చెక్ డ్యామును సందర్శించారు. గ్రామస్తులు సహకరించి ఆ దారిని మూసి వేస్తూ టాక్టర్లను అడ్డుగా ఉంచడం జరిగింది. కావున ఈ దారిలో వాహనదారులు, ప్రజలు ఎవరు వెళ్ళకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు.
