- 12 మంది టెండర్ల స్ర్కూట్ని
- 27న టెండర్ల ఖరారు
- టెండర్లు దక్కించుకోవడానికి జోరుగా పైరవీలు
బతుకమ్మ, నిజామాబాద్ – ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు భోజనం సరఫరా కోసం నిర్వహించే టెండర్లు ఈ నెల 27కు వాయిదా పడ్డాయి. శుక్రవారం జీజీహెచ్ లో అదనపు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో టెండర్లు దాఖలు చేసిన వారి పత్రాలను పరిశీలన జరిపారు. నిజామాబాద్ జిల్లాలో అర్హతలు కలిగిన అధికారులు లేరని గత నెలలో ఖమ్మం బదిలీ అయిన ఏడిని రప్పించి స్ర్కూట్ని చేయడం విశేషం. ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ జిల్లా జనరల్ ఆసుపత్రిలో డైట్ టెండర్ల కోసం గత నెల జూలై 12 నుండి 20 వరకు టెండర్లు వేసే అవకాశం ఉండడంతో 12 మంది డైట్ టెండర్లు దాఖలు చేశారు. అందరికీ ఉదయం అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి బదిలి పై వెళ్లిన ఏడి స్ర్కూట్ని నిర్వహించారు. మీరూ గతంలో చేసిన అనుభవం జీఎస్టీఐటీ చెల్లింపు చేస్తున్నారా అనే అంశాలన్నీ వాటికి మార్కులను కూడా అందులో విధించారు అని టెండర్ లో పాల్గొన్నవారు సమాచారం అందించారు. శుక్రవారం సాయంత్రం డ్రాలో పాల్గొనే అవకాశం కల్పించారు. ఈ డ్రా పద్ధతిలో పాల్గొన సమయంలో డ్రాలో పాల్గొన్నవారు అందరూ గతంలో పనిచేసిన ఏడి ఖమ్మం కు బదిలీ అయినప్పటికీ ఆయన శుక్రవారం టెండర్ల ప్రక్రియలో ఏ విధంగా పాల్గొంటారని సాయంకాలం ప్రశ్నించడంతో దీనికి అంత సమాచారం తర్వాత వెళ్ళడిస్తామని మాజీ ఏడి నెమ్మదిగా జారుకున్నారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో గతంలో పని చేసిన ఏడి జూలై 21కే ఇక్కడి నుండి రీలీవ్ అయి జూలై 22 న ఖమ్మంలో జాయిన్ కావడం కూడా జరిగింది. జాయిన్ అయినప్పటికీ ఇక్కడ ప్రస్తుతం ఇంచార్జ్ ఏడీగా పనిచేస్తున్న అసోసియేట్ ప్రొఫెసర్ ఈ టెండర్ లో పాల్గొనవలసి ఉండగా బదిలీ అయిన ఉద్యోగి ఏవిధంగా ఏ పొజిషన్లో ఏ హోదాలో ఆయన టెండర్లు పాల్గొనవలసి అవసరం వచ్చిందని టెండర్లో పాల్గొన్న వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే 12 మంది టెండర్లు దాఖలు చేయగా అందులో గత 8 సంవత్సరాలుగా డైట్ టెండర్ నిర్వహిస్తున్న వ్యక్తి పాల్గొనడం విశేషం. ఇటీవల కాలంలో జీజీహెచ్ లో పురుగుల అన్నం, కాలం చెల్లిన ఆహార పదార్థాలతో వండివార్చిన ఉదంతాలు మీడియాలో బహిర్గతమైన జీజీహెచ్ అధికారులు మాత్రం అతనికి క్లీన్ చీట్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. జీజీహెచ్ లో పని చేస్తున్న ఓ అధికారికి హోటల్ ఉండగా అందులో సదరు డైట్ కాంట్రాక్టర్ సహాయ సహకారాలు అందించాడని ఆరోపణలున్నాయి. జీజీహెచ్ లో ఏ అధికారులు వచ్చినా వారిని మచ్చిక చేసుకుని నెలకు 14 లక్షల బిల్లు వచ్చే డైట్ కాంట్రాక్ట్ కోసం ఆయన ఎంత వరకు అయినా వెళ్తాడనేది టాక్ ఉంది. ఇప్పటికే పలు హాస్టళ్ళు, ఆసుపత్రుల డైట్ కాంట్రాక్ట్ ఉన్న వ్యక్తికి మళ్ళీ జీజీహెచ్ ను కట్టబెట్టేందుకే అధికారులు కుమ్మకయ్యారనే వాదనలున్నాయి. అందుకే శాఖపరంగా తీసుకువచ్చిన పత్రాలను కాదని వాటిని పరిగణలోకి తీసుకోకుండా టెండర్ ఫారాల్లో ఉన్న వాటిని చూడకుండా అనుభవం ఉందా, జీఎస్టీ క ట్టారా లాంటి ప్రశ్నలతో కన్ఫ్యూజ్ చేశారనే వాదనలున్నాయి. 12 టెండర్లలో ఒకనాలుగు మినహా మిగిలిన 8 మంది టెండర్ దాఖలు దారులకు అన్నీ అర్హతలు ఉన్నాయని తేలింది. ఈ నెల 27న టెండర్లను ఖరారు చేసే అవకాశం ఉంది. అయితే అధికారులు పాత కాంట్రాక్టర్ తో కుమ్ముకై అతనికే కట్టబెట్టేందుకు తతంగం నడుపుతున్నారని అందుకే బదిలీ అయిన ఏడిని రప్పించి స్ర్కూట్ని చేయించారని టెండర్లలో పాల్గొంటున్న వారు ఆరోపించారు. ఇదిలా ఉండగా ఆసుపత్రుల్లో టెండర్ల దాఖలు, ఖరారు ప్రక్రియ అంతా పథకం ప్రకారమే సాగదీత ధోరణి జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ నెల 27న పారదర్శకంగా టెండర్లు దాఖలు చేసిన వారిలో ఏ విధంగా ఎంపిక చేస్తారోనన్న సస్పెన్షన్ కొనసాగుతుంది.