నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: చాకలి ఐలమ్మ వర్ధంతిని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని అమరవీరుల పార్క్ లో న్న చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ స్రవంతి హాజరుకాగా, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనుగందుల మురళి, జిల్లా సంయుక్త కార్యదర్శి మెతుకు శివ కుమార్, పట్టణ ఉపాధ్యక్షుడు సుభాష్, లింగం, శంకర్ తదితరులు పాల్గొన్నారు.