బీఆర్ఎస్ రైతులపై మొసలీ కన్నీరు కారుస్తుంది

1,069

. . . తెలంగాణ బీజేపీ ఉనికి చాటుకునేందుకే రైతులను రెచ్చగొడుతుంది

. . . నవీపేట్  మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి

బతుకమ్మ,  నవీపేట్

కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పాలనను చూసి ఓర్వలేక ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తూ రోడ్లపై కొచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేయడం హాస్యాస్పదమని మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నవీపేట్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు నెలల్లోనే 31  వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేశారన్నారు. అందులో కొందరికి సాంకేతిక లోపల వల్ల, బ్యాంకు అధికారుల తప్పిదాల వల్ల రుణమాఫీ కాలేవన్నారు. రుణమాఫీ కానీ రైతులు మండల వ్యవసాయ అధికారులను కలిసి రైతు వివరాలను అందజేస్తే తప్పకుండా రుణమాఫీ జరుగుతుందని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దన్నారు. గత రెండు పర్యాయాలు ఒక్కొక్క రైతుకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని మోసపూరిత హామీలను కుమ్మరించి అధికారం చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి మొదటి ఐదు సంవత్సరాల పాలనలో విడుతల వారీగా నాలుగు విడతలు రైతులకు ఇచ్చిన లక్ష రూపాయల రుణమాఫీ డబ్బులను బ్యాంక్ అధికారులు వడ్డీ కిందనే జమ కట్టుకున్నారని ఆరోపించారు. మళ్లీ అధికారంలోకి వచ్చి కొంతమందికే రుణమాఫీ చేసి చేతులు దులుపుకొని రైతులను నట్టేట ముంచిందని విమర్శించారు.నల్ల చట్టాలను తీసుకువచ్చి రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ ఎంతోమంది రైతుల చావులకు కారణమైన బిజెపి రైతులు వాడే పనిముట్లపై జిఎస్టి వసూలు చేస్తూ ఆదానీ, అంబానీలకు దోచి పెడుతుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేసిన రాష్ట్ర ప్రభుత్వంపై బిజెపి రైతులను రెచ్చగొడుతుందన్నారు. గురువారం బోధన్ లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రైతులతో మాట్లాడుతూ రైతులెవ్వరు ఆందోళన చెందవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ జరుగుతుందని తెలిపారు. కాబట్టి రైతులెవ్వరు ఆందోళన చెందవద్దని అన్నారు. ఈ సమావేశంలో  ఎస్ కే బాబు, షేక్ మూస,నీరడి బుచ్చన్న,బుడ్డ సంజీవ్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి,అంజగౌడ్,రవి,రాయల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.