మద్యవర్తుల ద్వార వసూళ్ల ఎఫేక్ట్
బతుకమ్మ, నాగిరెడ్డిపేట్:
కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ శాఖలలో అవినీతి ఆక్రమాలను సహించేది లేదని ప్రకటించిన జిల్లా కలెక్టర్ అశీష్ సంగ్వాన్ కోరడ ఝూలిపిస్తున్నారు. గురువారం నాగిరెడ్డి పేట్ తహసీల్థార్ లక్ష్మన్ ను సస్పెండ్ చేస్తు ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్లారెడ్డి డివిజన్ లోని నాగిరెడ్డి పేట్ పేట్ తహసీల్థార్ లక్ష్మన్ పై అవినీతి ఆరోపణలు రావడంతో పాటు తన చేతికి మట్టి ఆంటకుండా ప్రతి పనికి మద్యవర్తుల ద్వార వసూళ్ల పర్వానికి తెరలేపారు. తహసీల్ధార్ పై అవినితి ఆరోపణలపై ఆర్డిఓ ప్రభాకర్ ద్వార విచారణ చేయించారు. అర్డిఓ నివేధికలో లక్ష్మణ్ వసూళ్ల పర్వం వాస్తవమేనని నివేధిక ఇవ్వడంతో అయనను సస్పెండ్ చేస్తు ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా కలెక్టర్.