పాత్రికేయుల పాత్ర మరువలేనిది

473
  • ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో పాత్రికేయులకు సన్మానం

బతుకమ్మ , కోటగిరి :  మంద కృష్ణ మాదిగ ఎస్సి వర్గీకరణ కోసం చెసిన ముప్పై ఏండ్ల పాటు సుదీర్ఘ పోరాటంలో పాత్రికేయుల పాత్ర మరువలేనిదినీ ఎంఆర్పిఎస్ మండల నాయకులు కొనియాడారు. కోటగిరి మండలం కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణంలో ఉమ్మడి కొటగిరి మండల ఎంఆర్పిఎస్ కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మడి మండల పాత్రికేయులకు శాలువా పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ  ఎస్సి వర్గీకరణ కోసం మంద కృష్ణ మాదిగ చేసిన పోరాటానికి అన్నివేళలా సహాయ సహకారలు అందించి తమ విజయంలో పాత్రికేయుల పాత్ర మర్చిపోలేదని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో పోచారం మాదిగ, దౌలయ్య మాదిగ, నాగయ్య మాదిగ, ఆనంద్ మాదిగ,గంగాధర్ మాదిగ, సాయిలు మాదిగ,పాత్రికేయ మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.