బతుకమ్మ భిక్కనూర్: భిక్కనూర్ స్థానిక టోల్ ప్లాజా లో పనిచేసిన ఇటీవల మృతి చెందిన ఏనుగు సంతోష్ రెడ్డికి తోటి టోల్ ప్లాజా సిబ్బంది వారి ఒకరోజు వేతనాన్ని ఆదివారం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా టోల్ ప్లాజా లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి సంతోష్ రెడ్డి చిత్రపటానికి సిబ్బంది నివాళులు అర్పించారు. కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ కాసాల నర్సాగౌడ్ సిబ్బంది పాల్గొన్నారు.