గిరిరాజ్ కళాశాల సమస్యలు పరిష్కరించాలి

962
  •  ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం వినతి

బతుకమ్మ, నిజామాబాద్ : నిజామబాద్ నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల సమస్యలు పరిష్కరించాలని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డికి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.యస్.యు.) ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్, కళాశాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగేష్, సలీం లు మాట్లాడుతూ, కళాశాలలోకి ఆకతాయిలు,గంజాయి సంబంధించిన వ్యక్తులు వస్తున్నారన్నారు. అటువంటి వారు రాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా, కళాశాల చుట్టూరా సీసీ కెమెరాలు అమార్చాల్సిందిగా కోరారు. కళాశాల చుట్టూరా ప్రహరీ గోడ నిర్మించాల్సిందిగా కోరారు. విద్యార్థులకు ఇంగ్లీషు, కంప్యూటర్ సంబంధించిన స్కిల్స్ పెరగడానికి కళాశాలలో నాలెడ్జ్ సెంటర్ ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. విద్యార్థుల అందరికీ పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. రాష్ట్ర ఉన్నత విద్య శాఖ తెలిపిన విధంగా విద్యార్థులను ఎటువంటి స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను అడగవద్దని సర్టిఫికెట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల PDSU కమిటీ సహాయ కార్యదర్శి నసీర్, నాయకులు అనిల్, మంగ,గోపాల్ ,చందన,వివేక్, లిఖిత ,షన్ను వర్మ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.