బతుకమ్మ మోర్తాడ్ : కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవడంతో నీటిలో దోమలు అభివృద్ధి చెంది తద్వారా ప్రజలకు డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్ తదితర వ్యాధులు వ్యాపిస్తాయి. ఈ విషయాన్ని గ్రహించిన గ్రామపంచాయతీ కార్యదర్శి స్వప్న డొంకల్ గ్రామంలో అక్కడక్కడ ఇండ్ల మధ్య వాటర్ నిలిచిపోవడంతో దోమ లార్వా అభివృద్ధి చెందుతాయని గ్రహించి దోమల లార్వా ల నివారణకై శుక్రవారం యాంటీ లార్వా లిక్విడ్ స్ప్రే చేయించడం జరిగిందని పేర్కొన్నారు. దీంతో దోమల లార్వాలు చనిపోతాయని దోమల అభివృద్ధిని అరికట్టవచ్చని తెలియజేశారు. అలాగే ఇంటి పరిసరాల చుట్టూ పనికిరాని వస్తువులలో నిలిచిన నీటిని పారబోయించారు. మండలంలోని ధర్మోరా, శేట్పల్లీ గ్రామాల్లో సైతం యాంటీ లార్వా లిక్విడ్ స్ప్రే చేయించారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.