గ్రామపంచాయతీని తనిఖీ చేసిన డి ఎల్ పి ఓ

1,156

బతుకమ్మ పిట్లం : పిట్లం మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ శుక్రవారం నాడు డి ఎల్ పి ఓ నాగరాజు ఆకస్మితంగా తనిఖీ చేశారు. డి ఎల్ పి ఓ మాట్లాడుతూ మేజర్ గ్రామపంచాయతీ అయినా అధికారులు సక్రమంగా సమయపాలన పాటించి పారిశుధ్యం పై దృష్టి పెట్టాలని అన్నారు. ఎల్ఆర్ఎస్ కూడా పకడ్బందీగా చేపట్టాలని ఆయన కోరారు. ఇండ్ల నిర్మాణం కొరకు ఇచ్చే అనుమతులు స్థల పరిశీలన చేసి తర్వాత అనుమతులు గ్రామపంచాయతీ నుండి ఇవ్వాలని ఆయన ఈవో యాదగిరికి సూచించారు. గ్రామ పంచాయతీ పరిధిలో మురికి కాలువలు చెత్త కుప్పలు లేకుండా చూడాలని సూచించారు. అలాగే మండల వ్యాప్తంగా ఉన్న ఈవోలు కూడా ప్రతి ఒక్కరు సక్రమంగా బిధులు నిర్వహించాలని ఆయన కోరారు వ్యాధుల పట్ల అప్రమత్తం ప్రజలను చేయాలని నీటిని నిలువలను ఉంచుకోకూడదని, వేడి నీళ్లు త్రాగాలని ప్రజలకు తెలపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఓ యాదగిరి, మనోజ్ కుమార్, గ్రామపంచాయతీ సిబ్బంది ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.