మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటేండేంట్ ఇంటిలో 24 గంటలు కొనసాగిన ఎసిబి సోదాలు
. . . నరేందర్ ను ఏసీబీ న్యాయమూర్తి ముందు హాజరపరచనున్న ఏసీబీ
. . . బైపాస్ భూ వ్యవహరమే నరేందర్ పై ఏసీబీ దాడులకు కారణమా?
. . . మరింత లోతుగా విచారణ కోసం కస్టడీ కోరే అవకాశం
. . . నరేందర్ అక్రమార్జన ఆస్తుల అటాచ్ మెంట్?
బతుకమ్మ, నిజామాబాద్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ ఇంటిలో శుక్రవారం తెల్లవారు జామున ఏసీబీ చేపట్టిన తనిఖిలు, సోదాలు శనివారం ఉదయం వరకు కొనసాగాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా చరిత్రలోనే అవినీతి నిరోధక శాఖ ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి కేసులో తనిఖీలు, సోదాల కోసం 24 గంటలు మించిన సమయం తీసుకోవడం తొలిసారి. నిజామాబాద్ రేంజ్ ఏసీబీ అధికారులు శుక్రవారం తెల్లవారుజామున నుంచి జిల్లా కేంద్రంలో నిజామాబాద్ మున్సిపల్ ఉద్యోగి దాసరి నరేందర్ ఇంటిలో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రానికి నరేందర్ ఇంటిలో లభించిన నగధు, బ్యాంకు బాలేన్స్, బంగారు నగలు, ఆస్తులు పత్రాల ఆధారంగా అక్రమార్జన రూ.6.7 కోట్లుగా నిర్ధారించారు. కానీ తనిఖీలు సోదాలను కొనసాగించారు. ఈ తనిఖీలు శనివారం ఉదయం వరకు కొనసాగాయి. శనివారం ఉదయం వరకు కొనసాగిన తనిఖీలు సోదాల అనంతరం దాసరి నరేందర్ ను ఏసీబీ అధికారులు హైదరాబాద్ కు తరలించారు. శనివారం మధ్యహ్నం హైదరాబాదులోని నాంపల్లి లో గల ఎసిబి కోర్టులో న్యాయమూర్తి ముందు నరేందర్ ను హాజరు పరచనున్నారు. పూర్తి వివరాలను న్యాయస్థానం కు
…బైపాస్ భూ వ్యవహరమే నరేందర్ పై ఏసీబీ దాడులకు కారణమా?
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో నరేందర్ ను ప్రమేయం లేకుండా ఏ పని జరగదు అనేది జగమెరిగిన సత్యం. దాదాపు 24 సంవత్సరాలుగా మున్సిపల్ కార్పొరేషన్ లో తిష్ట వేసిన నరేందర్ అందరితో కలిసిమెలిసి ఉంటు తన పనులను చక్కబెట్టుకునే వాడనేది అందరికీ తెలిసిన విషయం. ప్రతి పనికి ఒక రేటు నిర్ణయించి వసూలు చేసి కోట్లకు పడగలెత్తాడు అనేది బహిరంగ రహస్యం. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులతో కలివిడిగా తిరుగుతూ పనులు చక్కబెట్టుకున్న నరేందర్ కు ఇటీవల బైపాస్ రోడ్డులో ఒక భూమి కొనుగోలు విషయంలో జరిగిన వ్యవహారమే ఏసీబీకి పట్టించేలా చేసినట్టు సమాచారం. కోట్ల విలువచేసే భూమి విషయంలో నరేందర్ చక్రం తిప్పడంతో పాటు తెరవెనుక అంత వ్యవహరించడంతో అక్కడ ఉన్న ఇతర వ్యక్తులే ఈ విషయంపై అధికార పార్టీ నేతలకు ఒప్పందించినట్టు తెలిసింది. నిజామాబాద్ అర్బన్ పై పెత్తనం చేస్తున్న అగ్ర నేతలు ఏసీబీకి సంబంధిత విషయంపై సమాచారాన్ని లీక్ చేసినట్టు తెలిసింది. దాని కారణంగానే గత కొన్ని రోజులుగా నరేందర్ పై నజర్ వేసిన ఎసిబి భూమి కొనుగోలు కోసం డబ్బులు ఇంట్లో పోగుచేసుకుని ఉన్నప్పుడే పక్క సమాచారంతో దాడి చేసినట్టు ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో ఆనాటి ప్రజాప్రతినిధితో నరేందర్ చట్ట పట్టాలేసుకొని తిరగడం ప్రస్తుత అధికార పార్టీ నేతలకు ఆగ్రహానికి కారణమని తెలిసింది. ఈ నేపథ్యంలోనే నరేందర్ కు స్పాట్ పెట్టి ఏసీబీకి పక్క సమాచారం అందించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఏసీబీ దాడులతో నరేందర్ షాక్కు గురైన అధికార పార్టీ నేతలకు ముందే తెలుసు అనేది చాలామంది చెబుతున్నారు. ఇప్పటికే పలువురు నరేందర్ ను గత కొన్ని రోజులుగా ఏసీబీ నగర్ వేసిందని సమాచారం అందించినప్పటికీ తనకి కాదని తన వెనుక అందరూ ఉన్నారని నమ్మిన నరేందర్ కు ఆదాయం కి మించిన ఆస్తులను కూడా కొట్టారని కేసు నమోదు చేసి తనిఖీలు సోదాలతో ఏసీబీ ఊహించని షాక్ ఇచ్చింది.
. . . నరేందర్ కు మళ్లి ఎసిబి కస్టడి తప్పదా…. అక్రమార్జన ఆస్తుల అటాచ్ మెంట్?
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటేండేంట్ దాసరి నరేంధర్ ఆక్రమాస్తుల పుట్ట కదులుతోంది. శుక్రవారం వరకు రూ.6.07 కోట్లుగా ఎసిబి నిర్థారించింది. కాని 24 గంటలకు పైగా సోదాలు కోనసాగడం, నిజామాబాద్, హైధ్రబాద్, నిర్మల్ జిల్లాలతో పాటు మహరాష్ర్టలో స్థిరాస్తులు ఉన్నట్లు తెలిసింది. బినామీల పేర్ల మీదా కుటుంబ సభ్యులు మీదా ఉన్న ఆస్తులను గుర్తించేందుకు నరేంధర్ ను శనివారం న్యాయస్థానంలో హజరుపరియిన విచారణ కోసం ఏసీబీ కస్టడి కోరే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఇప్పటివరకు నరేందర్ వద్ద లభించిన ఆస్తులలో ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు ఉండడంతో వాటిని అటాచ్ మెంట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా నరేందర్ వద్ద ఉన్న ఆస్తులు వివరాలు ఇంకా బహిర్గతం కాకపోవడం పోరుగు రాష్ట్రాల్లో ఉన్న ఆస్తులను లెక్కించిన తరువాతనే న్యాయస్థానం అనుమతి మేరకు నరేంధర్ కుడ బేట్టిన ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉంది.
